లెజండరీ సింగర్ కె.జె.ఏసుదాస్ చాలా కాలం తర్వాత హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. జనవరి 20న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్తోపాటు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో జనవరి 19న కె.జె.ఏసుదాస్, ఆయన తనయుడు విజయ్ ఏసుదాస్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాస్ గెస్ట్హౌస్ని తెలంగాణ రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ కట్టుకున్న గెస్ట్హౌస్ హైదరాబాద్లోని రాయదుర్గం ఏరియాలో సర్వే నెంబర్ 45లో ఉంది. సర్వే నెంబర్ 45లో 84 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో 2200 గజాల ప్లాట్ని ప్రభాస్ కొనుక్కొని గెస్ట్హౌస్ కట్టుకున్నాడు. ఐతే ఈ సర్వే నంబర్ మొత్తంగా ప్రభుత్వానికే చెందుతుందని మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల కారణంగా అధికారులు సైలెంట్గా ఉన్నారు. ఇపుడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభాస్కి షాక్ తగిలింది. ప్రభాస్ కొనుక్కొన్న ప్రీమియం ల్యాండ్ ప్రభుత్వానికి వెళ్తోంది. తెలిసో, తెలియక ప్రభాస్ హైదరాబాద్లోని రాయదుర్గంలో కొంతస్థలం కొన్నాడు.ఆ స్థలాన్ని తన గెస్ట్హౌస్ కోసం వాడుతున్నాడు. అయితే, ఇటీవల కోర్టు ఆ సర్వే నెంబర్లోని మొత్తం స్థలం ప్రభుత్వానిదే అని తీర్పు ఇచ్చింది. రాయదుర్గంలోని మొత్తం 85 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సూపర్స్టార్ రజనీకాంత్, అక్షయ్కుమార్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న విజువల్ వండర్ "2.0." ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చారు ఈ త్రయం.
ఈ సినిమా భారతీయ చిత్రరంగం గర్వపడే విధంగా రూపొందిందని రజనీకాంత్ అన్నారు.
"రోబో విడుదలై ఎనిమిదేళ్లు అవుతుంది. ఆ సినిమా ఆడియో సమయంలో శంకర్గారు నాకు తెలుగు తెలియదని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగు జనాలు చాలా మంచివాళ్లు. వాళ్లని అందరూ ఇష్టపడతారు", ఇలా తెలుగువారిని పొగిడేశాడు రజనీకాంత్.
హైదరాబాద్లోని ఐటీ ప్రాంతంగా పేరొందిన గచ్చిబౌలిలో మహేష్బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభానికి రెడీ అయింది. నిజానికి ఈ మల్టీప్లెక్స్ని అమీర్ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంతోనే ప్రారంభించాలనుకున్నాడు. అమీర్ఖాన్ని ఇన్వైట్ చేశారు. కానీ అమీర్ఖాన్ రాలేనని చెప్పడంతో క్యాన్సిల్ అయింది. ఇక ఇపుడు సూపర్స్టార్ రజనీకాంత్ భారీ చిత్రం 2.0తో ప్రారంభిస్తాడట. రజనీకాంత్ని ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.