కమెడియన్ అలీ ఈ సారి ఏపీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నాడు. తన సొంత పట్టణమైన రాజమండ్రి నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ బరిలోకి దిగాలనేది ఆయన డ్రీమ్. గుంటూరు సీటుని ముస్లింలు అధికంగా ఉన్నారనే కారణంతో అడుగుతున్నాడు. మొన్న వైఎస్సార్సీ అధినేత జగన్ని కలిసి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఇపుడు తెలుగుదేశం పార్టీ మంత్రి గంటాని కలిసి మళ్లీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఏ పార్టీలో చేరనున్నాడు? ఏ విషయమైనా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 16న ప్రకటిస్తానని అంటున్నాడు అలీ.
తెలంగాణ ఎన్నికల్లో తెరాసకి అనుకూలంగా ఓటేయ్యాల్సిందిగా తన అభిమానులను, జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ కోరుతాడని రాజకీయ విశ్లేషకులు అంతా భావించారు. కానీ జనసేనాని మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగానూ చెప్పలేదు. ట్విట్టర్ ద్వారా వీడియో సందేశాన్ని పంపాడు.
తక్కువ అవినీతి, పారదర్శకమైన పాలన అందించే వారిని ఎన్నుకోమని కోరాడు. దాన్ని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎలా అర్థం చేసుకుంటారనేది చూడాలి.
తెలంగాణ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలపనున్నారు. ఈ మేరకు ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుగుసినిమా.కామ్ ఇంతకముందే వార్తను ప్రచురించింది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సారాంశం అదే.
తెలంగాణకి షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు వచ్చినందున ఈ సారి తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇక తాజాగా ఆయన తమ పార్టీ అభిమానులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నాడు.