పాలకొల్లులో కల్యాణ మండపం కట్టిస్తా: బ‌న్ని

Allu Arjun donates Rs 10 lakhs to Kalyana Mandapam
Wednesday, January 16, 2019 - 15:00

ఈసారి సంక్రాంతి సంబ‌రాలు త‌మ సొంత ఊరు పాలకొల్లులో జ‌రుపుకున్నాడు అల్లు అర్జున్‌. త‌మ‌ బంధువులు కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు కుటుంబంతో కలిసి పాల‌కొల్లు వెళ్లాడు బ‌న్ని

ఈ సందర్భంగా పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం సందర్శించాడు బ‌న్ని. అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో అల్లు అర్జున్ కుటుంబం పాల్గొంది.

"మా తాతగారు పాలకొల్లు లో పుట్టారు... మా నాన్నగారు ఇక్కడే పుట్టారు..నేను మద్రాసు లో పుట్టాను.. ఆ తరువాత హైద్రాబాద్ లో పెరిగాను... అయితే నన్ను మీ ఊరు ఏది అంటే మాత్రం పాలకొల్లు అని మాత్రమే చెప్తాను," అని అన్నాడు అల్లు అర్జున్‌.

"పెళ్లయ్యాక మా ఆవిడ అడిగింది మీ పాలకొల్లు తీసుకెళ్లవా అని. నాకు కూడా చాలా రోజుల నుండి అందరూ హైద్రాబాద్ నుండి ఊర్లు వెళ్తున్నారు.. రోడ్లు ఖాళీ అవుతున్నాయి.. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అని... ఈ సారి మా ఊరు పాలకొల్లు వెళ్ళాలి అనుకుని వచ్చేసా. ఇక్కడికి రావటానికి మెయిన్ కారణం మాత్రం నా ఫామిలీ. నా ఊరు పాలకొల్లు మా తాతయ్య కి నాన్నకి కొంచెం ఇచ్చింది. నాకు చాలా ఇచ్చింది. అలాంటి నా ఊరుకు ఏమైనా ఇవ్వాలి. కాదు ఇస్తూనే ఉండాలి.. అందుకే ఈ సంక్రాంతి నుండి స్టార్ట్ చేస్తున్నా... పెద్ద గుడిలో కల్యాణ మండపం కట్టిస్తా... దానికి 10 లక్షలు డోనేషన్ ఇస్తున్నా... ప్రతి సంక్రాంతి ఇక్కడే జరుపుకునే ప్రయత్నం చేస్తా... అలానే ఈ ఏర్పాట్లు అన్ని చేసిన నా మిత్రుడు, ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను," అని అన్నారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.