శిష్యుడి సీన్ డైరెక్ట్ చేసిన సింగీతం

Singeetham directs a scene of VN Aditya's new film
Monday, November 25, 2019 - 13:45

వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరి
మధ్య' . ఈ సినిమాకు సంబంధించి మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో హీరోయిన్ , తదితరులపై  కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.  విశేషమేమిటంటే ఈ సినిమా షూటింగు జరుగుతుండగా వి.ఎన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీసమేతంగా ఈ సినిమా సెట్ కు వచ్చారు. అంతేకాదు ఓ సన్నివేశానికి కూడా దర్శకత్వం వహించారు. దీనికి వి.ఎన్. ఆదిత్య క్లాప్ కొట్టడం మరో విశేషం.

‘బృందావనం’,‘భైరవద్వీపం’,‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు వి.ఎన్.ఆదిత్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పుడు ఎలా క్లాప్ కొట్టారో... ఇప్పుడు మళ్లీ అలా కొట్టడంతో సెట్ లో ఉన్న అంతా ‘క్లాప్స్’కొట్టేశారు. పైగా సింగీతం శ్రీనివాసరావులాంటి దర్శకుడి దర్శకత్వంలో నటించినందుకు నేటి తరం నటులు కూడా ఎంతో సంబరపడ్డారు. హీరోయిన్, ఆమె తల్లిదండ్రుల మీద ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

‘వాహిని సంస్థలో నేను కొట్టిన క్లాప్ అనుభూతి మళ్లీ ఇన్నాళ్లకు పునరావృతమైంది. నా గురువు సింగీతం గారు మొట్టమొదటిసారి నా సెట్ కు వచ్చారు. అప్పట్లో నాలుగేళ్లు ఆయన దగ్గరే ఉండి వాళ్లింట్లో భోజనంచేసి పెరిగిన కుర్రాడిని నేను. ‘పీపుల్స్ మీడియా' అధినేత  విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభోట్ల కూడా  అతిథులుగా మా షూటింగ్ కు వచ్చి మా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నారు. నిర్మాత అర్జున్ గారు పట్టుబట్టలు పెట్టి సింగీతం  దంపతులను సత్కరించారు. హాప్ డే ఆయన మాతోనే గడిపారు’ అని వివరించారు వి.ఎన్.ఆదిత్య. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.