ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ తీయనున్న బయోపిక్కి టైటిల్ ఫిక్స్ అయింది. ఎన్టీఆర్ అనే పేరునే టైటిల్గా రిజిష్టర్ చేయించారు. ఒకే ఒక్కడు, భారతరత్న, తిరుగులేని మనిషి వంటి పేర్లను పరిశీలించారు కానీ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల్లోనే అసలు పవర్ ఉందని అదే టైటిల్ని రిజిష్టర్ చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడు.
తేజ దర్శకత్వంలో రూపొందే ఈ బయోపిక్ని నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రెపాటి సంయుక్తంగా నిర్మిస్తారు. వారి మూడు బ్యానర్స్ పాలుపంచుకొంటాయి నిర్మాణంలో.
రాంగోపాల్ వర్మ నెక్స్ట్ సినిమా..నాగార్జునతో. ఆ తర్వాత లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీ రామారావు బయోపిక్.
తేజ తదుపరి చిత్రం.. వెంకటేష్తో. ఆ తర్వాత ఎన్టీ రామారావు బయోపిక్.
గురుశిష్యులు రాంగోపాల్ వర్మ, తేజ ఇలా పోటాపోటీగా సాగుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఎన్టీఆర్ జీవిత చరిత్రని అనౌన్స్ చేశారు. ఇద్దరూ ఆ సినిమాకి ముందు మరో సినిమా చేస్తామంటున్నారు.
వేదిక మారింది కానీ ఆయన వర్కింగ్ స్టయిల్ మారలేదు. ఇదివరకు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా హంగామా చేసేవాడు. ఇపుడు ఫేస్బుక్లో. ట్విట్టర్ మీద అలక వహించి ఫేస్బుక్లోకి వచ్చాడు. రామ్గోపాల్ వర్మకిపుడు ఒకే ఒక్క వ్యాపకం: ఎన్టీఆర్ సినిమా గురించి అప్డేట్ చేయడం, టీవీ ఛానెల్స్లో మాట్లాడడం.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ రీసెంట్గా ప్రకటించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుని కూడా ఫిక్స్ చేశాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంగా ఈ కథ సాగుతుందట.
ఫైర్బ్రాండ్ రోజా ఊహాగానాలకి తెరదించింది. వర్మ తీసే "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాలో అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని ప్రకటించింది. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని వర్మ తీస్తానని అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్రాజ్ అనీ, లక్ష్మీపార్వతిగా రోజా అని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే వర్మ అదంతా తూఛ్ అనేశాడు.