ఆ పాత్ర కాదు నాది: అనసూయ
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న తొలి సినిమాలో అనసూయ ఒక కథానాయికగా నటిస్తోంది. "ఈ నగరానికి ఏమైంది" సినిమాలో ఒక హీరోగా నటించిన ఒక నటుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. ఈ మూవీలో కథానాయకుడిగా "పెళ్లిచూపులు" సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడు. దాంతో తరుణ్ భాస్కర్ సరసన అనసూయ నటిస్తోందని భావించారు.
ఈ విషయంలో అనసూయ తాజగా వివరణ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం "కథనం" అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెట్లో మీడియాతో మాట్లాడింది. విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న మూవీ గురించి కూడా వివరణ ఇచ్చింది. తరుణ్ భాస్కర్, నేను, మరో యువ జంట ఈ సినిమాలో నటిస్తున్నాం. ఐతే నేను తరుణ్ భాస్కర్కి జంటగా నటించడం లేదు. నాది కీలకమైన పాత్రే, అని చెప్పుకొచ్చింది.
"రంగస్థలం" సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయకి ఇపుడు మంచి క్రేజుంది.
- Log in to post comments