RRR:దిల్ రాజుకి నైజాం, చౌదరికి ఈస్ట్!

Dil Raju bags RRR rights for 70 crore
Thursday, February 6, 2020 - 23:15

జనవరి 8, 2021న "ఆర్.ఆర్.ఆర్" విడుదల అవుతుంది అని అధికారికంగా డేట్ రావడంతో... సినిమా బిజినెస్ షురూ అయింది. కళ్ళు చెదిరే ఆఫర్లతో దిల్ రాజు సహా బడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ రాజమౌళి, దానయ్యల వద్దకి పరుగెత్తారు. 

ఇప్పటికే దిల్ రాజు ..నైజాం రీజియన్ కి బిజినెస్ తెగొట్టాడని టాక్. నైజాం లో ఇప్పటివరకు ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్.. బాహుబలి 2. ఆ సినిమా షేర్ 68 కోట్లు వచ్చింది. రీసెంట్ గా సంక్రాంతి కి విడుదలయిన "అల వైకుంఠపురంలో", "సరిలేరు నీకెవ్వరు" కలిసి ...దాదాపు 75 కోట్ల వరకు కలెక్ట్ చేశాయి. అందుకే... దిల్ రాజు... 75 కోట్లు ఇస్తాను అని ముందుకొచ్చాడు అంట. ఆర్.ఆర్.ఆర్. సోలోగా రిలీజ్ కానుంది. సో ... తనకే రైట్స్ ఇస్తే... వేరే సినిమాకి థియేటర్లు కూడా దక్కవు అనేది దిల్ రాజు ధీమా. అందుకే అంత భారీ మొత్తం అఫర్ చేసినట్లు ఉంది. 

మరోవైపు, ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ...భరత్ కుమార్ చౌదరి తీవ్రంగా ట్రై చేస్తున్నారు. హీరో ఎన్టీఆర్ కి చౌదరి క్లోజ్. ఎన్టీఆర్ బ్యాక్ ఉంది భరత్ చౌదరికి. సో... ఈ డీల్ కూడా క్లోజ్ కానుంది. 20 కోట్లు ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు భరత్ చౌదరి.