డైరక్టర్ గా మారుతున్న పీటర్ హెయిన్స్
పీటర్ హెయిన్స్ .పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణవంశీ దర్శకత్వంలో `మురారి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `అపరిచితుడు`, `శివాజీ`, `గజిని`, `మగధీర`, `రోబో`, `విలన్`, `విక్రమ సింహ`, `బాహుబలి`, `మన్యం పులి`...ఇలా ఆయన చేసిన సినిమాల లిస్టు చాలా పెద్దది. పీటర్ హెయిన్స్ `స్టార్ట్... కెమెరా... యాక్షన్` అని మెగాఫోన్ పట్టుకుంటారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరక్టర్గా తన డ్రీమ్ డెబ్యూ గురించి చాన్నాళ్లుగా ఆయన కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. పీటర్ హెయిన్స్ కలను సాకారం చేయడానికి నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు.
లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై `లక్ష్మీ`, `లక్ష్యం`, `రేసు గుర్రం` ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి. తాజాగా తమ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ సంస్థలో పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
"హీరో, హీరోయిన్ తో పాటు ఇతర ఆర్టిస్టులను ఎంపిక చేయాలి. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. చిత్రాన్ని దసరాకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తాం. మా బ్యానర్లో మరో మంచి సినిమా వస్తుందని గర్వంగా చెప్పగలను`` అని అన్నారు బుజ్జి.
- Log in to post comments