అనసూయకిది అవసరమా?
"రంగస్థలం" సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ మొన్నటి వరకు ఆ సినిమా ఇచ్చిన ఫేమ్తో హాయిగా ఎంజాయ్ చేసింది. మొదట్లో ఆమెని ట్విట్టర్లో జనం తెగ ట్రోల్ చేసేవారు. చీటికిమాటికి ఆమె రకరకాల కామెంట్స్ చేస్తూ ఉండేది. దాంతో జనం కూడా వైల్డ్గా రియాక్ట్ అయ్యేవాళ్లు. ఐతే రంగస్థలం సినిమా తర్వాత ఆమె అస్సలు నెటిజెన్ల నుంచి నెగిటివ్ కామెంట్లను అందుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆమెకి ఆ అనుభవం ఎదురైంది.
ఈ సారి ఆమె ట్రోలింగ్ గురి కావడానికి రీజన్..ఒక యాడ్. ఒక క్లాత్ స్టోర్ యాడ్లో నటించి ట్రోలింగ్ని ఎదుర్కొంటోంది. ఈ యాడ్లో ఆమె "మాయాబజార్"లోని సావిత్రిలా కనిపించింది. ‘ఆహా నా పెళ్లంట’ అనే పాటలో సావిత్రి కనిపించినట్లు అనసూయ అచ్చం అదే గెటప్లో సావిత్రిలా దర్శనమిచ్చింది. అయితే ఇది కొందరికి రుచించలేదు. ఇటీవలే కీర్తి సురేష్ని సావిత్రిలా చూసిన కళ్లతో అనసూయని చూడలేకపోతున్నామంటూ వారు ఆమెపై కామెంట్స్ మొదలుపెట్టారు.
‘సావిత్రి గారితో నీకు పోలికా? సావిత్రమ్మని ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి’.. అంటూ ఆమెని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.
Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati !!
The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me I will cherish this work forever pic.twitter.com/PhURdgvoX8— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2018
- Log in to post comments