'రాధ'కి యూ, మే 12న విడుదల

శర్వానంద్ తాజా చిత్రం రాధ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమాకి యూ సర్టిఫికెట్ దక్కడం విశేషం. మే 12న విడుదల కానుంది ఈ మూవీ.
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందించి చిత్రం `రాధ`.
"వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంటర్టైనర్ `రాధ`. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో మే 12న విడుదల చేస్తున్నామ"న్నారు బీవీఎస్ ఎన్ ప్రసాద్.
ఈ సినిమాని కొత్త దర్శకుడు చంద్రమోహన్ తీశాడు. లావణ్య త్రిపాఠి, అక్ష హీరోయిన్లుగా నటించారు.
- Log in to post comments